25, డిసెంబర్ 2014, గురువారం

చంద్రుని పదహారు కళలు

చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన


దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో మిక్కిలి ప్రేమ చూపెడివాడు, ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా, శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు, అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది. ఓషదులన్ని క్షీణించినవి, అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు. అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను. అంత పరమేశ్వ రుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షాన కళలు క్షీణించి, శుక్లపక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు. 

నక్షత్ర మంత్రాలు


నక్షత్ర మంత్రాలు

యజుర్వేదంలోని నక్షత్రేష్టిలో వేరు వేరు నక్షత్రాలకు 27 నక్షత్రాలకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి.ఒక్కో నక్షత్రానికి 8 వాక్యాలతో కూడుకున్న మంత్రం ఉంటుంది.వైదిక సాహిత్యంలో అన్ని చోట్ల నక్షత్ర గణన కృత్తిక నక్షత్రం నుండి ప్రారంబమవుతుంది.కృత్తిక నుండి విశాఖ నక్షత్రం వరకు దేవ నక్షత్రాల విభాగంగాను ,అనూరాధ నుండి భరణి నక్షత్రం వరకు యమ నక్షత్రాలుగాను విభజించబడింది.

ఉత్తరాషాడ 4 వ పాదం,శ్రవణా నక్షత్ర 1 వ పాదం కలిసి అభిజిన్నక్షత్రం .జయింప శక్యంకాని పనులు జయింప జేయాలంటే అభిజిత్తులో చేయాలి.

10, డిసెంబర్ 2014, బుధవారం

శివలింగ సాలగ్రామం(Sivalinga Saligramam)

శివలింగ సాలగ్రామం

'సాలగ్రామం' సాక్షత్ విష్ణుస్వరూపం.దీనిని అభిషేకించిన పుణ్యజలాన్ని ప్రోక్షించుకుంటే సర్వపాపాలు నశిస్తాయి.సర్వరోగాలు నశించి,సకలసంపదలు లభిస్తాయి.సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషివాక్కు.విష్ణుభగవానుడు ‘సాలగ్రామం’ అనేరాయిరుపాన్ని ధరించడం వెనుక అనేక కధలున్నాయి.అందులో ముఖ్యమైనది బృందకథ. 

8, డిసెంబర్ 2014, సోమవారం

ఉత్తరావృత శంఖం(Left Side Conch),(Uttaraavruta Sankh)



ఉత్తరావృత శంఖం

శ్రీ కృష్ణుని గురువు సాందీపుడు.సాందీపుడు బలరామ కృష్ణులకు వేదాలు, వేదాంగాలు, ధనుర్వేదం, తంత్రం, ధర్మశాస్త్రాలు, న్యాయం, తర్కం, రక్షకత్వం, రాజవిద్యాలు........ మొదలగుఅరవై నాలుగు విద్యలను అరవై నాలుగు రోజులలో నేర్పుతాడు. ఆ గురువుగారిని గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని అడిగారు.బలరామకృష్ణులకు ఉన్న మానవాతీతమైన బుద్ది వైవాన్ని చూసి బార్యతో ఆలోచించి ప్రభాస తీర్ధంలో సముద్రములో పడిపోయిన తమ పుత్రున్ని ఇవ్వమని అడుగుతారు.శ్రీకృష్ణుడు సముద్రుని వద్దకు వెళ్ళి స్నానం చేస్తుండగా ఒక తరంగం వచ్చి మా గురు పుత్రులను మింగిందట ఆ పిల్లవాన్ని ఇవ్వమని అడుగుతాడు.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...